- Image : courtesy with Eenadu sukhibhava.
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గవదబిళ్లలు,Mumps- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
ఉన్నట్టుండి జ్వరంతో పిల్లలకు దవడలు వాచిపోయి.. గవదబిళ్లలు మొదలైతే.. చూడటానికి చాలా భయంగా ఉంటుంది. నొప్పి వేధిస్తుంది. పెద్దల్లో వస్తే బాధలు కాస్త తీవ్రంగా కూడా ఉంటాయి. అయినా.. ఇది మరీ అంత ప్రమాదకరమైన వ్యాధేం కాదు. దీనివల్ల దీర్ఘకాలం మిగిలిపోయే సమస్యలేం ఉండవు. అసలిది రాకుండా సమర్థమైన టీకా ఉంది!
చిన్నపిల్లల్లో సాధారణంగా వచ్చే వ్యాధుల్లో గవదబిళ్లలు ఒకటి. దీన్నే 'మంప్స్' అంటారు. ఆటలమ్మ, పొంగుల మాదిరిగానే ఇది కూడా వైరస్ కారణంగా వచ్చే సమస్య. ఇది 5-9 ఏళ్ల మధ్య వయసు పిల్లల్లోఎక్కువ. అయితే ఇది పెద్దల్లో కూడా రావచ్చు, పైగా పెద్దలకు వస్తే బాధలు కాస్త తీవ్రంగా ఉంటాయి. ఈ గవదబిళ్లల సమస్య ఏడాదంతా ఎక్కడోచోట కనబడుతూనే ఉంటుందిగానీ ఎండకాలం నుంచి వర్షరుతువు మొదలయ్యే మధ్య అధికం. అలాగే 2-3 మూడేళ్లకు ఒకసారి ఇది విస్తృతంగా చాలామందిని చుట్టబెడుతుంటుంది!
- ఎలా వస్తుంది?
తిరుగుతుండే స్కూళ్లు, హాస్టళ్లలో ఎక్కువగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంటుంది. ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏమంటే- ఈ వైరస్ ఒంట్లో చేరిన తర్వాత బాధలు, లక్షణాలు మొదలవటానికి 14 నుంచి 21 రోజులు పట్టొచ్చు. పూర్తిస్థాయి గవద బిళ్లలున్న వారి నుంచే కాదు, తొలిదశ లక్షణాలున్న వారి నుంచీ ఈ వైరస్ ఇతరులకు వ్యాపిస్తుంది!
- గ్రంథులలో స్థావరం
- సమస్యల ముప్పు
- అరుదుగా ప్రమాదం
అయితే ఇవి అరుదు, పైగా సకాలంలో చికిత్సతో చాలావరకూ నయమైపోతాయి.
* గవదబిళ్లల్లో వాపు, నొప్పి, బాధలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఇతరత్రా సమస్యలు, మరణాలు చాలా చాలా తక్కువ.
* ఎంఎంఆర్ టీకా వేయించుకోవటం ద్వారా దీని బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
* గవదబిళ్లలు వచ్చి, వృషణాలు వాస్తే భవిష్యత్తులో పిల్లలు పుట్టరనుకోవటం పెద్ద అపోహ. ఇది అనవసరమైన భయమే తప్ప ఇందులో నిజం లేదు.
- టీకాతో నివారణ
* ఒకసారి గవదబిళ్లలు వస్తే జీవితంలో మళ్లీ ఎప్పుడూ రాదు. ఈ వ్యాధి వచ్చినవారికి దాని నిరోధకశక్తి జీవితాంతం ఉంటుంది.
* పెద్దల్లో గవదల వాపు వచ్చినప్పుడు, లేదా ఎవరికైనా ఒక వైపే వాపు వచ్చినప్పుడు- గవదబిళ్లలు కాకుండా లాలాజల గ్రంథుల నాళాలు మూసుకుపోవటం, ఇన్ఫెక్షన్ల వంటి ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయేమో చూడాల్సి ఉంటుంది.
- పెద్ద అపోహ
- పరీక్షలతో నిర్ధారణ
- విశ్రాంతి కీలకం
Courtesy with : Eeandu sukhibhava , writen by Dr.Aswanikumar -prof. of medicine , Ashram medical college-Eluru.
- ===================
No comments:
Post a Comment